telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

దాడులకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదు: మంత్రి కేటీఆర్

KTR TRS Telangana

సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై జరిగిన దాడిని లంగాణ ఐటీ, ముస్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఖండించారు. కరోనా వైరస్‌ బాధితులను కాపాడేందుకు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పని చేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. అలాగే నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గురువారం ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిపై కొంతమంది దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు వారి విధులకు అడ్డు పడుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ‘గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకున్న ఘటనలను సహించేది లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు అజ్ఞానులే కాదు, వారివల్ల ఇతరులకు కూడా ప్రమాదమే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Related posts