telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలి: చంద్రబాబు

chandrababu

కరోనా బాధితులను సమాజం నుంచి వేరుచేసి చికిత్స అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాధి ప్రమాదకరమైనదని, కరోనా వ్యక్తి ఏదైనా వస్తువును తాకితే, ఆ వస్తువును ఇతరులు తాకితే వారికి కూడా కరోనా సోకుతుందని అన్నారు. అందుకే ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని వివరించారు.

దక్షిణ కొరియాలో కేవలం ఒక వ్యక్తి ద్వారా వేలమందికి వ్యాపించిన విషయం మరువరాదని అన్నారు. అక్కడ ఒక వ్యక్తి నుంచి కొంతమందికి, ఆ కొంతమంది నుంచి అనేకమందికి… ఆ విధంగా రెట్టింపు అయిందని పేర్కొన్నారు.దీనిపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలని సూచించారు.

వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా కరోనాను నివారించుకోవచ్చని, వేడినీళ్ల ఆవిరి పట్టడం ద్వారా ముక్కులోని చెడు బ్యాక్టీరియా నశిస్తుందని వివరించారు. వేడినీటిలో ఉప్పు కలుపుకుని పుక్కిలించాలని అన్నారు. అంతేకాకుండా ఆహారం పరిమితంగానే, అవసరం మేరకు తరచుగా తీసుకోవాలని తెలిపారు.

Related posts