telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే… షర్మిల సంచలనం

తెలంగాణ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి 8 నెలలు గడిసిపోయిందని, కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఇంకెప్పుడు KCR సారు? అని నిలదీశారు. కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమేనని షర్మిల పేర్కొన్నారు. “కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి 8 నెలలు గడిసిపోయింది, కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఇంకెప్పుడు KCR సారు? చచ్చే వారు పేదలు కాదనా? లేక పేదలు చచ్చినా ఎవరు అడిగేవారు ఉండరనే ధైర్యమా? లేక .. మీ లెక్కకు సరిపడ మరణాలు నమోదు కాలేదనా? అయ్యా .. KCR సారు .. ఇప్పడికే జనం తిరగ పడుతున్నరు, కరోనా తో రోడ్ల మీద పడ్డమని, బతుకులు ఆగమైనయని, జనం ఇంకా బర్బాద్ కాకముందే కరోనా ను ఆరోగ్యశ్రీ లో చేర్చండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. లేదంటే .. కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే.” అని ఫైర్ అయ్యారు షర్మిల.

Related posts