టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు కురిపించారు. సోమవారం హైదరాబాద్లో మొబైల్ సంస్థ వన్ప్లస్ ఆర్ అండ్ డీ సంస్థ ప్రారంభించింది. ఈ సందర్భంగా అనేక దిగ్గజ సంస్థలను హైదరాబాద్ తీసుకురావడంలో కేటీఆర్ కృషి ఎంతో ఉందని ఒవైసీ పేర్కొన్నారు.
గత ఏడాది ఒప్పో, ఈమధ్య అమెజాన్, నేడు వన్ ప్లస్ రాకతో హైదరాబాద్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతోందని ఓ పాత్రికేయుడు చేసిన ట్వీట్ పై ఒవైసీ స్పందించారు. ఇదంతా కేటీఆర్ శ్రమ ఫలితమేనని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కేటీఆర్ ను మళ్లీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా చూడాలని కోరుకుంటున్నామని తెలిపారు. అసద్ చేసిన ఈ ట్వీట్ కు కేటీఆర్ స్పందించారు. ఎంపీ గారు ఎంతో మంచి మాటలు చెప్పరంటూ కేటీఆర్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలిపారు.
జగన్ అవినీతి ఆరోపణల పై లక్ష్మీనారాయణ క్లారిటీ!