telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

ఎస్బిఐ ఖాతాదారులకు షాక్..3 రోజులు అన్ని సేవలు బంద్!

SBI కస్టమర్లకు భారీ షాక్ తగలనుంది. ఇవాళ్టి నుంచి 3 రోజులు ఆన్‌లైన్ సర్వీసులకు అంతరాయం కలుగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లను అలర్ట్ చేసింది. బ్యాంక్ సర్వీసులు మే 21, 22, 23 తేదీల్లో కొన్ని గంటలపాటు అందుబాటులో ఉండవని తెలిపింది. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మెయింటెనెన్స్ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. మే 21న 22.45 గంటల నుంచి మే 22న 01.15 గంటల వరకు, అలాగే మే 23న 02.40 గంటల నుంచి 06.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్‌బీఐ తెలిపింది. 

Related posts