telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

శుభవార్త… పీఎఫ్ ఖాతాదారుల విషయంలో నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం

Nirmalasitaraman

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగుల టేకోమ్ శాలరీ పెరుగుతుంది. దీంతో చేతిలో కొంత ఎక్కువ డబ్బులు మిగులుతాయి. వచ్చే మూడు నెలలు ఇది వర్తిస్తుందని తెలిపారు. కంపెనీలు మాత్ర 12 శాతం పీఎఫ్ అకౌంట్‌కు కంట్రిబ్యూట్ చేస్తాయని పేర్కొన్నారు. అలాగే కంపెనీలకు కూడా ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని మరో మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఇది వర్తిస్తుంది. కంపెనీలు, ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కేంద్ర ప్రభుత్వమే ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తుంది. రూ.15000 లోపు వేతనం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొత్తంగా 14 నిర్ణయాలతో ముందుకు వచ్చింది. ఇందులో ఎంఎస్ఎంఈలకు సంబంధించి 6, ఈపీఎఫ్‌కు 2, ఎన్‌బీఎఫ్‌సీలు సహా మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి 6, డిస్కామ్స్‌కు సంబంధించి 1, కాంట్రాక్టర్లకు 1, రియల్ ఎస్టేట్‌కు సంబంధించి 1, పన్ను చెల్లింపుదారులకు సంబంధించి 6 నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు (సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలు) అధిక ప్రాధాన్యం లభించిందని చెప్పుకోవచ్చు. వీటికి రూ.3 లక్షల కోట్ల ఆటోమేటిక్ రుణాలు అందిస్తామని తెలిపారు. వీటికి ఎలాంటి గ్యారంటీ అవసరం లేదన్నారు. 4 ఏళ్ల కాల పరిమితితో ఈ రుణాల జారీ ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 21 వరకు ఈ లోన్స్ పొందొచ్చని పేర్కొన్నారు. దీంతో 45 లక్షల యూనిట్లకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఎంఎస్ఎంఈల నిర్వచనం కూడా మారుస్తున్నామని ఆమె తెలిపారు. దీంతో వారి పరిమాణం పెరుగుతుందని, ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ పరిమితిని పెంచామని తెలిపారు. అలాగే టర్నోవర్ పరిమితిని కూడా పెంచామని వివరించారు. ఈ-మార్కెట్‌ప్లేస్, సప్లై చెయిన్ మెరుగుపరచడం, ఇన్వెస్ట్‌మెంట్లు సహా పలు కీలక చర్యలు తీసుకుంది.

Related posts