భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేయడంలో దిట్ట అని తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన వేలమందితో కలిసి యోగాసనాలు వేశారు. మోదీ యోగ నిద్ర ఆసనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ స్పందించారు. మోదీ యోగ నిద్ర అద్భుతం” అంటూ కొనియాడారు. అంతేకాదు, ప్రధానికి ట్విట్టర్ వేదికగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తనకెప్పుడు ఖాళీ సమయం లభించినా యోగ నిద్ర ఆసనం వేస్తుంటానని, ఇది ఒత్తిడిని అమోఘంగా తొలగిస్తుందని, లాక్ డౌన్ కాలంలో ఫిట్ గా ఉండడానికి ఈ ఆసనం వేయండంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు. యోగ నిద్ర ఆసనం వేసే విధానంపై ఆయన ఓ వీడియోను కూడా ట్వీట్ చేయగా ఇవాంకా ట్రంప్ వెంటనే స్పందించడం విశేషం.