గాజువాక ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సీరియస్గా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ సవాంగ్, ఏపీ సీఎస్ని సీఎం జగన్ ఆదేశించారు. బాధితురాలు వరలక్ష్మి కుటుంబసభ్యులకు 10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్లను ఆదేశించారు. విద్యార్థినులందరూ దిశా యాప్ను డౌన్లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి 9:30గంటల సమయంలో ప్రేమోన్మాదం ఓ యువతి ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ కాలేజీలో ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకున్న వరలక్ష్మి అనే యువతిని చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్సాయి వెంకట్ ప్రేమ పేరుతో వేధించేవాడు. శనివారం రాత్రి రాము అనే స్నేహితుడితో కలిసి ఆమెకు ఫోన్ చేసి సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అతన్ని నిలదీయగా..మాట్లాడాలి రా అంటూ తుప్పల్లోకి లాక్కెళ్లాడు. అక్కడి పరిస్థితిని చూసిన వరలక్ష్మి ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అఖిల్ సాయి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికాడు.
previous post
next post