telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

వరవరరావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ

varavara Rao

బీమా కోరేగావ్ కుట్ర కేసులో విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్ ను ముంబై ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. ఈ కేసు ఆరోపణల్లో భాగంగా ప్రస్తుతం వరవరరావు పుణే జైలులో ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వరవరరావు, నాగపూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సోమా సేన్ లు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల పై విచారణ జరిపిన న్యాయస్థానంవారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

మహారాష్ట్రలోని పుణె సమీపంలో బీమా కోరేగాం హింసలో మావోయిస్టుల ప్రమేయం ఉందని, ఆ కేసు దర్యాప్తు సందర్భంగా ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఆరోపణలు. ఆ కుట్ర కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, అందులో వరవరరావు కూడా ఉన్నారు.

Related posts