నగరంలోని ఖైరతాబాద్ కూడలిలో పోలీస్ ఎస్కార్ట్ వాహనం దగ్ధమైంది. బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ తక్షణమే కారును ఆపి బయటకు దిగేశాడు. మిగతా వారు కూడా కారులో నుంచి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఉద్యోగులు కార్యలయాలకు వెళ్లే సమయం కావడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. కారు ఇంజిన్లో విద్యుత్ షాక్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పంజాగుట్ట పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post