telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్నాయుడు నిర్దోషిగా బయటకు వస్తారు: సోమిరెడ్డి

somireddy chandramohan

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కనబర్చుతోన్న తీరు పట్లవిమర్శలు గుప్పించారు. ఈఎస్‌ఐ కేసులో ఆయనను ఇప్పటికీ రిమాండ్ లోనే ఉంచడం పట్ల ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

‘ఏ తప్పు చేయని అచ్చెన్నాయుడు ఇంకా రిమాండ్ లోనే ఉండటం బాధేస్తోంది. ఆ కుటుంబం దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉంది. మంత్రిగా అచ్చెన్న తీసుకున్న నిర్ణయాల్లో పట్టుమని 10 లక్షల అవినీతి కూడా చూపలేకపోయినప్పటికీ కేసులతో వేధిస్తున్నారు. కక్ష సాధింపులకు ఓ పరిమితి వుంటాయి. చివరకు ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

Related posts