telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు: చంద్రబాబు ఫైర్

chandrababu

బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ సర్కార్ పై టీడీపీ అధ్యక్షుడు అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అన్ని అయిపోయాయని, ఇప్పుడు హత్య కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టారని, యనమల రామకృష్ణుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని, అయ్యన్న పాత్రుడి నిర్భయ కేసు పెట్టారని, బీద రవిచంద్ర యాదవ్ పై శాసనమండలిలోనే మంత్రులు దాడి చేశారని ఆరోపించారు. వీటికి కొనసాగింపుగా, మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై హత్య కేసు బనాయిస్తారా అంటూ ప్రశ్నించారు.

Related posts