telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్

Vijayasai reddy ycp

కేంద్రం ఆశీస్సులతోనే ఏపీలో పనులు చేస్తున్నామంటున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మండిపడ్డారు. సమాఖ్య వ్యవస్థలో ఎవరి ఆశీస్సులు ఎవరికీ ఉండవని తేల్చి చెప్పారు. రాష్ట్రం, కేంద్రం ఎవరి పని వారు చేసుకుంటూ పోవాల్సిందేనని అన్నారు. పోలవరంపై తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కేంద్రానికి రాష్ట్రం చెప్పాల్సిందేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. డబ్బులు చెల్లించేది కేంద్రమే కాబట్టి అన్నీ చెప్పి తీరాల్సిందేనని అన్నారు.

రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటుంటే కేంద్రం ఊరుకోబోదన్నారు. పోలవరం అథారిటీ నుంచి దీనిపై నివేదిక కోరామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత పోలవరంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత ఉన్నంత మాత్రాన రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి వీలులేదని కేంద్రమంత్రి పునరుద్ఘాటించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వ వైఖరిని కేంద్రం తప్పుపట్టింది.

Related posts