telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్..కొత్తగా 837 మందికి కరోనా

Corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో అక్కడ రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 38,898 శాంపిళ్లను పరీక్షించగా మరో 837 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 789 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 258మంది కరోనా నుంచి కోలుకోగా, ఎనిమిది మంది మృతి చెందారు.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు 14,414 కాగా, ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 16,934 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 8,082 మంది ఏపీ వాసులు చికిత్స పొందుతున్నారు ఇప్పటివరకు 6,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 206 మంది మృత్యువాత పడ్డారు.

Related posts