telugu navyamedia
Uncategorized క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

చత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల మృతి

Two moists killed encounter vishakha

చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో దంతెవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి చెందారు. రెండోవిడత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దంతెవాడ అడవుల్లో గాలిస్తున్న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పోలింగ్ సందర్భంగా జిల్లా రిజర్వు గార్డులు దంతెవాడలోని ధనికార్కా అడవుల్లో గాలిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. రిజర్వు గార్డులు తిరిగి కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని కంకర్, రాజనందన్ గామ్, మహాసముంద్ నియోజకవర్గా్లో గురువారం పోలింగ్ సాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతో పరిసర అటవీ ప్రాంతంలో పోలీసులు భారీగా కూంబింగ్ చేపట్టారు.

Related posts