ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలకు ఇప్పటికే కరోనా వ్యాధి సోకగా… తాజాగా ప్రముఖ హీరోయిన్ నిక్కీ గల్రానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. కరోనా పాజిటివ్ అని తేలిందని.. తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపింది నిక్కీ గల్రానీ. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో స్వయంగా అనుభవిస్తున్నానని.. తనకు గొంతు నొప్పి, జ్వరం, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నాయన్నారు. అయితే ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నానని, తన ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలియజేశారు నిక్కీ గల్రానీ. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు నిక్కీ గల్రానీ. తన ఆరోగ్యం కుదటపడాలని ప్రార్ధిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపింది నిక్కీ గల్రానీ. తెలుగులో కృష్ణాష్టమి, మరకటమణి చిత్రాల్లో నటించారు నిక్కీ గల్రానీ.
I was tested Positive for #COVID-19 last week.
I’m on my way to recovery and feeling much better now 🙏🏻😊
I’d like to thank my close ones for looking out for me, all the frontline Health Workers & mainly the #Chennai #TamilNadu #Corporation for their Constant Support ♥️ pic.twitter.com/bk6QsIqqZz— Nikki Galrani (@nikkigalrani) August 13, 2020
ఎదవ పుట్టుక… అలా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది : పూరీ