ఇటీవల అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య జరగటంతో రెవెన్యూశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసుల సహకారంతో భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచడంతో పాటు అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉన్న నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించింది.
ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరణకు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని.. ఆ సమయంలో సిబ్బంది మొత్తం అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొంది. రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ముఖ్యమైన చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
” అమ్మ ఒడి” ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం: రోజా