telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆయన చెప్పిన కధ చిరుకి బాగా నచ్చింది…

chiru

‘ఖైదీ నెం:150’, ‘సైరా’ సినిమాల తర్వాత స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల చిత్రం తర్వాత మెగాస్టార్ మలయాళం మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటిస్తారని, సుకుమార్, వి.వి. వినాయక్, సుజిత్ వంటి దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ చిరు సైడ్ నుంచి క్లారిటీలేదు. చిరు, వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయడం ఫిక్స్ అయిపోయింది. ముందుగా మెగాస్టార్, ‘లూసిఫర్’ రీమేక్ వినయ్‌ను చేయమన్నారు. ఇటీవలే వినయ్ ‘సినిమా చూపిస్తమావ’, ‘నేను లోకల్’, ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’ ‘హలోగురు ప్రేమకోసమే’ వంటి సినిమాలకు రచయితగా పనిచేసి గుర్తింపు పొందిన ప్రసన్నకుమార్ బెజవాడ చెప్పిన కథ విన్నారు. ఆయనకు బాగా నచ్చడంతో ‘ముందు ప్రసన్న చెప్పిన కథ వినండి అన్నయ్య.. మీకు నచ్చితే ఓకే.. లేదంటే ‘లూసిఫర్’ చేద్దాం’ అని చిరుకి చెప్పగా.. తాజాగా ఆయన ప్రసన్న కథ విన్నారు. సింగిల్ సిట్టింగులోనే స్టోరి ఓకే చేసేశారు.. ప్రస్తుతం వినాయక్, ప్రసన్న ఈ కథపై పూర్తిస్థాయిలో వర్క్ చేస్తున్నారు.

Related posts