telugu navyamedia
ట్రెండింగ్

పోలీస్ సెలక్షన్ లో .. మరో యువతి మృతి..

applicant died in police selection

నిరుద్యోగ యువత ఉద్యోగం నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దానితో ఉత్సాహంగా అందరూ దరఖాస్తు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ, సెలక్షన్ వరకు వచ్చేసరికే, ఆ పరుగు పందేలు, లాంగ్ జంప్ తదితర శారీరక దారుడ్య పరీక్షలతో అభ్యర్థుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా, ట్రైనింగ్ సెంటర్ లో ఓ యువతి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో కానిస్టేబుల్ సెలక్షన్స్ ఏర్పాటు చేశారు.

వెలిశాల గ్రామానికి చెందిన మమత అనే యువతి కానిస్టేబుల్ సెలక్షన్స్ లో పాల్గొనేందుకు అక్కడికి వచ్చింది. అక్కడ ఏర్పాటు చేసిన పరుగు పందెంలో కూడా ఆమె పాల్గొంది. అయితే పరుగుపందెం ముగిశాక కాసేపటికే గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. అలాగే స్పృహ తప్పిపడిపోయిన మరో ఇద్దరు అభ్యర్థులను ఆస్పత్రికి తరలించారు. ఇరువురిని జగిత్యాలకు చెందిన రశ్మిత, చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మనీషాగా గుర్తించారు.

ఇటీవల కాలంలో ఇలా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణకు వచ్చి గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల హైదరాబాద్ లో ఇద్దరు యువకులు ఇలానే కన్నుమూయడం గమనార్హం.

Related posts