telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేకపోతే… : పవన్

pawan janasena

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కళ్యాణ్ తాజాగా మతాల గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదు. సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ, మిగతా మతాలని సహనంగా చూడటం. 1893, సెప్టెంబరు 11… స్వామి వివేకానంద వారు షికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు. ఇదే రోజు మనం ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం – మతసామరస్యాన్ని కాపాడుకుందాం’ అనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నాం. అంతా దైవ సంకల్పం” అంటూ వరుస ట్వీట్లు చేశారు పవన్. “మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి, ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి. భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేనట్లయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది’ అంటూ స్వామి వివేకానంద చెప్పిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేశారు పవన్. మతం కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌రిత్ర‌లో ఎన్నో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని చెప్పుకొచ్చారు. ‌

Related posts