స్టార్ యాంకర్ పలు షోలతో పాటు సినిమాల్లో కీలకపాత్రల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అనసూయ న్యూ ఇయర్ సందర్భంగా తన భర్త, పిల్లలు, అమ్మనాన్నలతో కలిసి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న తడోబా అంధేరి నేషనల్ పార్క్లో జంగిల్ ట్రెక్కింగ్ చేశారు. అక్కడి ప్రకృతి రమణీయతని తన కెమెరాలో బంధించి వాటిని నెటిజన్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. హైదరాబాద్ నుండి కారులోనే వారు అక్కడికి చేరుకున్నారు. అయితే “ఈ ట్రిప్లో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ప్రకృతి లేకుండా బతకలేమేమో అనిపించింది. నేను కెమెరాలో బంధించిన వాటిలో కొన్ని ఇవి. చాలా జ్ఞాపకాలు నా హృదయంలో ఉన్నాయి. వాటిని చూసి మురిసిపోయాను” అని అనసూయ తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. అనసూయ, కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటించనుంది.
previous post