telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : ఐదో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో రచ్చ రచ్చ

Bigg-Boss-4

బిగ్‌బాస్‌ సీజన్‌ 4 నాల్గో వీకెండ్‌ లో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఐదో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ మాత్రం కాస్త రసవత్తంగా సాగనుంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే ఈ రోజు రచ్చ మాములుగా లేదనిపిస్తోంది. ఈ నామినేషన్‌ ప్రక్రియలో అభిజిత్‌, అఖిల్‌కు మాటల యుద్దమే జరిగింది. అందులో అఖిల్‌కి క్రీమ్ పూసిన తరువాత అభి మాట్లాడుతూ.. నువ్వు మామాలుగా కన్ఫ్యూజ్‌ అవుతావని నాకు తెలుసు. కానీ నువ్వు పచ్చి అబద్ధం ఆడుతావని ఇప్పుడే తెలుసుకున్నా అని అన్నాడు. కళ్లు ఇలా చేసి, ఇలా చూసి మాట్లాడితే ఎదుటి వాడు భయపడడు అని గట్టిగా ఇచ్చేశాడు. వెంటనే స్పందించిన అఖిల్‌… వేలు అలా చూపించి మాట్లాడకు డ్యూడ్ అని సీరియస్‌ అవ్వగా.. నువ్వు ప్రతిసారి అదే చేస్తున్నావు అంటూ అభిజిత్‌ అన్నాడు. ఆ రోజు మోనాల్‌ని అలానే వేలు చూపించి మాట్లాడావు అని అభిపై అఖిల్‌ ఫైర్‌ అవగా.. ఆమె విషయం నీకెందుకు బ్రదర్‌ అంటూ అభి కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో అసహనానికి గురైన మోనాల్‌.. తన గురించి మాట్లాడకండి అంటూ ఏడ్చేసింది. ఆ సమయంలో గంగవ్వ, మోనాల్‌ని ఓదార్చింది. ఇక మరో ప్రోమోలో కూడా కంటెస్టెంట్స్‌ మధ్య జరిగిన మాటల యుద్దాన్నే చూపించారు. అందులో కూడా అభి, అఖిల్‌ల ఫైటే ఉంది. అంతగా మాట్లాడేది ఉంటే బయటకెళ్లి మాట్లాడుకో అని అభి సూచించగా… దమ్ముంటే నన్నుఇక్కడి నుంచి పంపించు బయటకెళ్లి మాట్లాడుకుంటా… అంటూ అభి కౌంటర్‌ ఇచ్చాడు. వేరే వాళ్ల టాపిక్ తీసుకురాకండి.. ఇది జాతీయ చానెల్ అందరూ చూస్తున్నారు అని మోనాల్ మళ్లీ ఏడ్చేసింది. ఇక ఇదంతా చూస్తూ భరించిన సోహైల్‌ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఏదో విషయంలో అభిజిత్‌ ఫైర్‌ అయ్యాడు. ఇక లాస్య, దివిల మధ్య మాటల యుద్దం నడిచింది. మొత్తానికి ఈ ప్రోమోలను చూస్తుంటే ఇవాళ హౌజ్‌లో రచ్చ ఎక్కువగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది.

Related posts