బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. ఈ కేసులో పలువురిన సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రేయసి, నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడిని సోమవారం సీబీఐ అధికారులు విచారించారు. తాజాగా రియా డ్రగ్స్ గురించి మాట్లాడుతున్న వాట్సాప్ చాట్ బయటపడింది. అయితే సీబీఐ కంటే ముందు బ్యాంకు ఖాతా నుంచి నిధుల తరలింపుపై రియా చక్రవర్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో డ్రగ్స్ పేరుతో రియా చక్రవర్తికి నేరుగా సంబంధాలున్నట్లు ఈడీ తేల్చింది. డ్రగ్స్ గురించి వాట్సాప్ చాట్లో రియా సంభాషించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రియా ఫోన్ డేటాను విశ్లేషించేందుకు సీడీఐ ఈడీతో కలిసి పని చేసే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా రియా, ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లు, ల్యాప్టాప్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.