telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మా ఉద్యోగులను .. పర్మినెంట్‌ చేయిస్తా.. : ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృధ్వీరాజ్‌

comedian prudviraj as ap state ycp principal secretary

సీఎం జగన్‌ కాళ్ళు పటుకోనైనా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌లో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్‌ చేయిస్తానని ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృధ్వీరాజ్‌ హామీ ఇచ్చారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సీనియర్‌ నటుడు ప్రభాకర రెడ్డి ఆదరణతో సినీ పరిశ్రమలో అడుగిడిన తాను దర్శక బ్రహ్మ బాపు వద్ద అసిస్టెంట్‌గా పని చేశానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో జన్మించినా…..శ్రీకాళహస్తిలో తన పెద్దమ్మ ఇంట్లో ఉండి చిన్నతనంలో చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు.ఎస్వీబీసీ చైర్మన్‌ అయిన వెంటనే ఆధార్‌, ఓటరు కార్డులను తిరుపతికి మార్చుకుని ఇక్కడే ఉంటూ స్వామివారికి సేవ చేస్తున్నానని పేర్కొన్నారు.

ఓ ఛానల్లో సినిమావార్తలు రాసిన అనుభవం తనకుందని చెప్పారు. తిరుమలలో అజెండాలు తప్ప, రాజకీయ జెండాలు ఉండవని, తాను తిరుమలలో రాజకీయాలు మాట్లాడబోనని తెలిపారు.ఎస్వీబీసీలో పనిచేస్తున్న 286మంది ఉద్యోగులకు న్యాయం చేస్తానన్నారు.ఎస్వీబీసీ అభివృద్ధికి మీడియా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. త్వరలో ఎస్వీబీసీ ప్రసారాలను హిందీలో కూడా ప్రసారం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి జె.భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు బాలచంద్ర, సురేంద్రరెడ్డి తదితరులు పృధ్వీరాజ్‌ను ఘనంగా సన్మానించారు.

Related posts