telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలీసుల విచారణకు సోమిరెడ్డి హాజరు.. ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పణ!

somireddy brother into ycp today

వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో భూవివాదం కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణాధికారి వద్దకు హాజరుకావాలని, భూవివాదానికి సంబంధించి ఏమి డాక్యుమెంట్లు ఉన్నాయో సమర్పించాలని రెండు సమన్లను వెంకటాచలం ఎస్సై కరిముల్లా ఈ నెల ఆరున సోమిరెడ్డికి అందజేశారు. ఈ నేపథ్యంలో
సోమిరెడ్డి నేడు పోలీసుల విచారణకు హాజరయ్యారు.

వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు సోమిరెడ్డి వచ్చారు. ఈ భూమికి సంబంధించి నకిలీ పత్రాలు ఇచ్చారని సోమిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. విచారణ సందర్భంగా తన వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలను పోలీసులకు సోమిరెడ్డి చూపించారు. మరోవైపు, పోలీస్ స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు.

Related posts