తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకూ పెరగడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు, పలువురు ప్రజానిధులు కరోనాబారినపడ్డారు. తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వైరస్ బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం ఆయన భార్యలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆమె పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆమెకు కరోనా నిర్ధారణ అయింది.
అనంతరం నిన్న సుధీర్ రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కొడుకులు, ఆయన ఇంట్లో పని చేసేవారు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. సుధీర్ రెడ్డితో పాటు ఇద్దరు కుమారులు, వంట మనిషికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.