టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఏపీకి మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా ఎన్నికవుతారని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. ఆ విజన్తోనే హైదరాబాద్ను అభివృద్ధి చేశారని ఆయన చెప్పారు.
ఏపి రాజధాని అమరావతిని కూడా అలాగే అభివృద్ధి చేస్తారని జగ్గారెడ్డి చెప్పారు. చంద్రబాబును రాష్ట్ర నాయకుడిగా కాదు..జాతీయ నాయకుడిగా చూడాలని జగ్గారెడ్డి సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మాట్లాడుతున్న కేసీఆర్.. తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణకి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎందుకు అడగలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయంపై కేసీఆర్ సమాధానం చెప్పాలి.. దత్తత్రేయ డిమాండ్