telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలకు ఈసీ అభ్యంతరం

Lakshmi's-NTR

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం తెలంగాణాలో విడుదలై మంచి హిట్ ను అందుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. అయితే ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్ లో “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం విడుదలవుతుందని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.

అయితే ఈ సినిమా ఎన్నికల వేళ విడుదల చేస్తే ప్రజలను ప్రభావితం చేస్తుందంటూ ఇటీవల కొందరు రాజకీయ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు అభ్యంతరం తెలిపింది. ఈ చిత్రం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నామని స్పష్టం చేసింది. “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రంపైనే కాకుండా కేసీఆర్ బయోపిక్ “ఉద్యమసింహం”, ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ “పీఎం మోదీ” చిత్రాల విడుదలకు కూడా ఈసీ అభ్యంతరం తెలిపింది. ఈ మూడు సినిమాలను ఎన్నికల సమయంలో విడుదల చేయవద్దంటూ గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో “లక్ష్మీస్ ఎన్టీఆర్” గత నెల 29న విడుదలైన విషయం తెలిసిందే.

Related posts