telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఈసీ తీరును వ్యతిరేకిస్తూ చంద్రబాబు ధర్నా

8th white paper released by apcm babu
కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సెక్రటేరియట్ 5వ బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఐటీ దాడులు కొనసాగించడం  తదితర పరిణామాలపై  ఏపీ ఎన్నికల ప్రధానాకాధికారి ద్వివేదికి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సంఘం  అనుసరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉందని చంద్రబాబు ఆయనకు వివరించారు.
ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా చూడాలని ద్వివేది దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరిస్తోందని బాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ ఆరోపణల ఆధారంగానే ఈసీ చర్యలు తీసుకోవడంపై బాబు తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందన్నారు.  ఈ దర్నాలో  ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు  పాల్గొన్నారు.

Related posts