తెలంగాణ సీఎం కేసీఆర్ భయానికి సినీనటులు ఏపీపై పడ్డారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైద్రాబాద్లో ఉంటూ కేసీఆర్కు ఊడిగం చేసుకోవాలని సినీ నటులపై బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు కష్టాలు ఉన్న సమయంలో సినీ నటులు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. చుట్టపు చూపుగా వస్తే తనకు అభ్యంతరం లేదన్నారు. కానీ, ఇక్కడికొచ్చి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే ఎవరిని వదిలిపెట్టనని బాబు హెచ్చరించారు.
సినీనటులు హైద్రాబాద్లో ఉంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారన్నారు. షాపింగ్లకు అధిక సమయాన్ని కేటాయిస్తారని బాబు గుర్తు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ప్రజలను కుక్కలు అంటూ హీనంగా తిట్టిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యారని బాబు విమర్శించారు. పోలవరంపై కేసీఆర్ కేసులు వేశాడని ఆయన చెప్పారు. చంద్రగిరి ఎమ్మెల్యే రౌడీయిజం చేస్తున్నాడని బాబు విమర్శించారు. ఈ ప్రాంతంలో పోలీసులు అనుసరిస్తున్న తీరును సీఎం తప్పుబట్టారు.
ఆ రాష్ట్రాల్లో ప్రియాంకా గాంధీ ఎందుకు ప్రచారం చేయడం లేదు: కేజ్రీవాల్