కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎదురుచూస్తున ఒక్కేఒక విషయం కరోనా వ్యాక్సిన్. అలాంటి సమయంలో కరోనా వైరస్ కు మొదటి టీకాను రష్యా తయారు చేసింది. స్పుత్నిక్ వి పేరుతో ఈ టీకాను మార్కెట్లోకి ఇప్పటికే రిలీజ్ చేసింది. అయితే, ఈ టీకాకు సంబంధించిన ఎలాంటి డేటాను ఆ దేశం బయటకు ఇవ్వకపోవడంతో టీకాపై ప్రపంచదేశాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో మూడోదశ ట్రయల్స్ ను రష్యా నిర్వహించింది. 92శాతానికి పైగా టీకా విజయం సాధించినట్టు ఇప్పటికే ఆ దేశం ప్రకటించింది. ఇక ఇదిలా ఉంటె, ఈ టీకా ఇప్పుడు భారత్ కు చేరింది. భారత్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ్ తో రష్యా ఇప్పటికే ఈ టీకా తయారీపై ఒప్పందం కుదుర్చుకుంది. రెడ్డీస్ ల్యాబ్స్ కు ట్రయల్స్ కు సంబంధించిన డోస్ లు చేరినట్టుగా రష్యా వెల్లడించింది. ఈనెల 15 వ తేదీ తరువాత 2,3 వ దశలకు సంబంధించిన ట్రయల్స్ ను ప్రారంభించబోతున్నారు. ట్రయల్స్ ట్రయల్స్ అనంతరం ఈ వ్యాక్సిన్ ను ఇండియాలో రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్పత్తి చేస్తుంది. మరి ఇది పూర్తిగా విజయంవంతం అయ్యి బయటకి ప్రజలకు అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి మరి.
previous post
బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ పనితీరు సరిగా లేదు: వెంగ్ సర్కార్