telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ తో మరోసారి రొమాన్స్ చేయనున్న మిల్కీ బ్యూటీ !

15 ఏళ్ల వయసులోనే తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంలో నటించింది. అదే ఏడాది తెలుగులో శ్రీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రం తెలుగులో తమన్నాకు మంచి బ్రేక్ అందించింది. ఆ తర్వాత ఎన్నో హిట్ లు కొట్టింది తమన్నా.  ఇదిలా ఉంటే… ఇప్పుడు మహేశ్ బాబును హావెల్స్ బ్రాండ్ యాడ్ కోసం డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. విశేషం ఏమంటే ఇందులో మహేశ్ బాబుతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటిస్తోంది. మంగళవారం ఈ ప్రచారం చిత్రం షూటింగ్ జరుగుతోంది. ‘ఆగడు’లో మహేశ్ సరసన నాయికగా నటించిన తమన్నా… గత యేడాది వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’లో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని గుర్తించే ఈ ప్రచార చిత్రంలో తమన్నాకు ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తుంటే… తమన్నా ‘సీటీమార్’లో గోపీచంద్ సరసన నటిస్తోంది. దీనితో పాటు ఆమె నటిస్తున్న మరో రెండు మూడు సినిమాలూ సెట్స్ పై ఉన్నాయి.

Related posts