ప్రముఖ గాయని కౌసల్య సైబర్ వేధింపుల బారిన పడ్డారు. తన ఫోన్ నెంబర్ తెలుసుకుని రోజూ దరిద్రమైన మెసేజ్లు పంపిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ తన బాధను వ్యక్తం చేశారు. “నాకే కాదు కౌసల్య మ్యూజిక్ అకాడమీలోని కొందరు అమ్మాయిలకు కూడా ఇలాంటి అసభ్యకరమైన మెసేజ్లు వస్తున్నాయి. అందరికీ ఒకే నెంబర్ నుంచి కాల్స్, మెసేజెస్ వస్తున్నాయి. కొందరు ఆకతాయిలు కుమ్మక్కై ఇలా చేస్తున్నారనిపిస్తోంది. ఇది ఇప్పటి సమస్య కాదు గత మూడేళ్లుగా ఈ వేధింపులను ఎదుర్కొంటున్నాం. ఓసారి ఓ కార్యక్రమం కోసం పోస్టర్లు సిద్ధం చేయించి మా నెంబర్లు కూడా ప్రింట్ చేయించాం. ఆ నెంబర్ ఆధారంగా ఇలా మెసేజ్లు చేస్తున్నారు. మాలాగా ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతీ ఆడపిల్ల పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాలపై ఫిర్యాదులు చేసేందుకు పోలీసులు ఓ వాట్సాప్ గ్రూప్ పెడితే బాగుంటుంది” అని తెలిపారు. అంతేకాదు ఇలాంటి ఆకతాయిల నుంచి తప్పించుకోవడానికి ఎప్పటికప్పుడు కొన్ని నెంబర్లను బ్లాక్ చేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఆమె ఏకంగా 342 నెంబర్లను బ్లాక్లో పెట్టారంటే ఆమెకు సైబర్ వేధింపులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోండి. అన్ని నెంబర్లు బ్లాక్ చేసినప్పటికీ ఇంకా కొత్త నెంబర్ల నుంచి మెసేజ్లు వస్తుండడంతో సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి కఠిన శిక్ష పడాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
next post
బికినీలో అనుష్క శర్మ… కోహ్లీ రియాక్షన్…!