శివసేనపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. ఈ రోజు నాగ్ పూర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో తాము శివసేనతో కలిసే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నామని అన్నారు. అప్పుడు ఆ పార్టీ నేతలతో కలిసి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.
గతంలోఇరు పార్టీలు పలు నిర్ణయాలు తీసుకుని అభివృద్ది పనులు ప్రారంభించామని అన్నారు. ఇప్పుడు తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా శివసేన వ్యవహరిస్తోందని విమర్శించారు. కానీ, గతంలో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అభివృద్ధి పనులను ఆ పార్టీ నిలిపివేస్తుందని విమర్శించారు.
జగన్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలి: స్వామి శ్రీనివాసానంద