telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

Chandrababu comments Jagan cases

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
*ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే:
*హైకోర్టులో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
*కొత్తగా మూడు బీసీ కార్పొరేషన్లు
*ముత్తరాసి/ తెనుగోళ్లు/ముదిరాజ్ లకు బీసీ కార్పొరేషన్
*నాగరాలు/నాగవంశీకులకు మరో బీసీ కార్పొరేషన్
*నీరగీత/కల్లుగీతలకు ఇంకొక బీసీ కార్పొరేషన్
*డ్రైవర్ సాధికార సంస్థకు రూ. 10 కోట్ల మూలనిధి
*కార్పొరేషన్ల పరిధిలోకి రాని మిగతా 54 కులాలకు న్యాయం చేయాలని నిర్ణయం
*బీసీ కార్పొరేషన్ కు అపెక్స్ బాడీ ఏర్పాటు
*ఇళ్లు నిర్మించుకునే స్థితిలో జర్నలిస్టులు లేనందున… భూమి తీసుకుని వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి, అవసరమైతే జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ను వాడుకోవాలని నిర్ణయం
*విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం పదబోడేపల్లిలో ఉన్న ఏపీఆర్ హైస్కూల్ ను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీగా అప్ గ్రేడేషన్
*కేబినెట్‌లో టేబుల్ అంశంగా సోలార్ విండ్ పాలసీ

Related posts