telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కబడ్డీ ఆడుతూ కాలుజారి పడ్డ మంత్రి మల్లారెడ్డి

బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లో 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా మరియు పురుషుల కబడ్డీ పోటీలు ప్రారంభమం అయ్యాయి. అయితే ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కసాని జ్ఞానేశ్వర్, మెయేర్లు బుచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్లు లక్ష్మీ గౌడ్,శివ గౌడ్,జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్,ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సంజీవరెడ్డి, దయాకర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రీడాకారులను ఉత్సాహ పరిచేందుకు మంత్రి మల్లారెడ్డి కబడ్డీ ఆడుతూ కాలుజారి పడ్డారు. క్రింద పడడంతో మిగిత వారు మంత్రి మల్లారెడ్డిని పైకి లేపారు. ఐతే ఈ ఘటనలో మంత్రి మల్లారెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts