మెగాస్టార్ తనపై పగ తీర్చుకుంటున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది హాట్ బాంబ్ శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ను తిట్టని రోజంటూ లేదేమో. ఇక మరో మెగా బ్రదర్ నాగబాబుని అయితే స్నేక్ బాబు అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా తిడుతూనే ఉంటుంది. తాజాగా సోమవారం నాడు ‘నాగబాబుకి గొంతు సెట్ అయ్యింది కాని.. బుద్ది సెట్ కాలేదు.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి పైనే పంచ్లా.. దూ**తీరిందా’ అంటూ ఫైర్ అయ్యింది శ్రీరెడ్డి. ఇక కాస్తో కూస్తో మెగాస్టార్పై ఫైర్ అయిన సందర్భాలు తక్కువే కాని.. ఆమధ్య బిగ్ బాస్ సీజన్ 3 విజేతను ప్రకటించడానికి వచ్చిన మెగాస్టార్.. స్టేజ్పైనే శ్రీరెడ్డి ఇన్ డైరెక్ట్ పంచ్లు వేశారు. ట్రాన్స్జెండర్ తమన్నాను పొగిడే ప్రయత్నంలో భాగంగా శ్రీరెడ్డి టాపిక్ లేవనెత్తారు మెగాస్టార్. అయితే అప్పటినుంచి అడపాదడపా మెగాస్టార్ని సైతం టార్గెట్ చేస్తోంది శ్రీరెడ్డి. తాజాగా చిరంజీవి తనపై పగ తీర్చుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ‘పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కావడం వల్ల పగ తీర్చుకోవడం కుదరడం లేదు కాని.. ఆయన అన్న.. లెజెండ్ అయిన చిరంజీవి మాత్రం నా మీద పగ తీర్చుకుంటున్నాడు.. తూ.. మీ ఫ్యామిలీ డ్రామా’ అంటూ సెన్సేషనల్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.
previous post
ఫిట్నెస్ కాపాడుకోకపోతే ప్రేక్షకులు చూడరు… సల్మాన్ ఖాన్