telugu navyamedia
క్రీడలు వార్తలు

టీం ఇండియా గెలుపుకు ముఖ్య కారణం అదే…

ఇంగ్లండ్ పర్యటనలో మూడు ఫార్మాట్లలో భారత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆసీస్ పర్యటనలో కూడా భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే భారత జట్టు పై తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ మాట్లాడుతూ… ‘ఇటీవల ఆస్ట్రేలియాలో భారత్ విజయాలను చూస్తుంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయాలు సాధించగల ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో కనిపిస్తోంది. విదేశాల్లో జట్లు తడబడుతోంటే భారత్‌ మాత్రం అన్ని టీంలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. కోహ్లీసేన వచ్చిందంటే దూరం నుంచి పరుగెత్తి బంతులేస్తే సరిపోదని ఆతిథ్య జట్లు గమనిస్తున్నాయి. ఒకప్పటి వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా తరహాలో ఇప్పుడు భారత జట్టులో ప్రతిభావంతులు ఉన్నారు. తుది జట్టులో చోటుకే ఇబ్బంది ఎదురవుతోంది. ఆటగాళ్లు పోటీపడుతున్నారు’ అని అన్నారు. అలాగే భారత దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థ అద్భుతంగా ఉంది. కోహ్లీసేన విజయవంతం అయ్యేందుకు కారణం అని ఛాపెల్ పేర్కొన్నాడు.

Related posts