telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సర్కారు వారి పాట : అప్పుడే శాటిలైట్ రైట్స్ బిజినెస్ ?

SVP

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇంకో నెలలో ఈ చిత్రం షూటింగ్ యూఎస్ లో మొదలు కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ విషయంలో పలు ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు భాషల్లో, శాటిలైట్ హక్కుల పరంగా భారీ స్థాయి బిజినెస్ మొదలైందని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా అన్ని భాషల్లో అన్ని హక్కులు కలుపుకొని 100 కోట్లకు పైగానే ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే ఈ టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related posts