telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినీ కార్మికులకు సంపూర్ణేష్ విరాళం..

Sampu

రోజు కూలీ తీసుకునే వాళ్లకు తెలుగు సినిమా పెద్దలు తీసుకున్న నిర్ణయం కరోనా క్రైసిస్ ఛారిటీ. దీనికి పలువురు సినిమా ప్రముఖులు ఇప్పటికే కోట్ల రూపాయలు ఇచ్చారు. నాగార్జున, చిరంజీవి మొదలుకొని కార్తికేయ లాంటి చిన్న హీరోల వరకు కూడా ఎవరికి తోచించి వాళ్లు ఇచ్చారు. ఇప్పుడు హీరో సంపూర్ణేష్ బాబు కూడా లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పాడు. కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా 2 లక్షలు విరాళంగా ఇచ్చాడు. కరోనా నుంచి అంతా త్వరగా బయటపడాలని ట్వీట్ చేసాడు సంపూ. ‘కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల తరపున సినీ పెద్దలు ముందుకొచ్చి కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా అందిస్తున్న సాయానికి నా పాదాభివందనం. నా తరపున ఒక లక్ష రూపాయలు వారికి అందజేస్తాను. త్వరలోనే ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ప్రార్ధిస్తున్నాను.. మీ సంపూ’ అంటూ ట్వీట్ చేసాడు సంపూర్ణేష్ బాబు.

Related posts