మెగాబ్రదర్ నాగబాబు ఇటీవల కాలంలో సంచలన ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయంగా ఆయన చేస్తున్న ట్వీట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. నాథూరాం గాడ్సే పై ట్వీట్ చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఆ తరువాత కరెన్సీపై గాంధీజీ ఫొటోనే ఎందుకు ఉండాలి? అనే అంశాలపై ఇటీవల ట్వీట్ చేసిన నాగబాబు తాజాగా టీటీడీ ఆస్తులను అమ్మాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. “తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామివారి భూములను అమ్మే హక్కు మీకు లేదు. హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను” అన్నారు నాగబాబు
తిరుపతి వెంకటేశ్వర స్వామి కి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు..హిందువుల మనోభావలని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 25, 2020