telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారత్ కు “రాధే శ్యామ్” టీమ్ తిరుగు ప్రయాణం అప్పుడే ?

Radhe-shyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని రొమాంటిక్ ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ భారీ చిత్రం షూటింగ్ అంతిమ దశలో ఉంది. ఇటీవలే ఇటలీలో షూటింగ్ కు గాను అక్కడకు వెళ్లి కీలక షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. ఇక అక్కడ నుంచే చిత్ర యూనిట్ పలు ఆసక్తికర అప్డేట్స్ ను కూడా వదిలారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్ టీం అక్కడ షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఈ వచ్చే అక్టోబర్ 31న భారత్ కు తిరుగు ప్రయాణం కానున్నట్టు టాక్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వరుసగా విడుదలవుతున్న “రాధేశ్యామ్”‌ మోషన్‌ పోస్టర్లు, ఫోటోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ అంటూ విడుదల చేసిన మోషన్ పోస్టర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. కాగా కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

Related posts