telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సగానికి పైగా పూర్తయిన మేజర్ షూటింగ్…

Major

గూఢాచారి సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు హీరో అడవి శేష్. దాని తరువాత ఎవరు అంటూ అందరిని అలరించాడు. అడవి శేష్ ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతె ప్రేక్షకులన ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు కూడా అదేవిధంగా మేజర్ ఉన్నికృష్ణన్ కథతో మేజర్ సినిమాను రూపొందిచాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతరం కార్యాల్లో నిమగ్రమైంది. అంతేకాకుండా అడవి శేష్ ఏపాత్ర చేస్తే తెరపై ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఎంత వెతికినా అడవి శేష్ కనిపించడు. అలా కనిపిస్తే ఆ పాత్రకు పూర్తి స్థాయి న్యాయం చేయనట్లుగా శేష్ అనుకుంటాడు. అతడు కథను కూడా చాలా  ఆచితూచి ఎంచుకుంటాడు. కథలో వైవిధ్యం, కొత్తదనం ఉంటేనే ఓకే అంటాడు. లేదంటే అది ఎంతటి దర్శకుడు ఇచ్చిన అవకాశం అయినా నిర్మొహమాటంగా నో చెప్పేస్తాడు. అడవి శేష్ తన విజయాన్ని ఒక్కరోజులోనో, ఒక్క నెలలోనో సాధించలేదు. 2002లో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన శేష్ చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. వాటిలో కొన్ని మంచి పాత్రలు చేసి వాటిని న్యాయం చేయడంతో పరిశ్రమలో తన ఉనికి తెలిసింది. దాంతో ఇట్టకేలకు గూఢాచారి సినిమాతో హీరోగా భారీ విజయాన్ని అందుకుని తన ప్రతిభను చాటుకున్నాడు. అతడు చేస్తున్న మేజర్ సినిమా ఇంకా 40 శాతం పని మిగిలి ఉంది.

Related posts