telugu navyamedia
క్రీడలు వార్తలు

సైనా నెహ్వాల్ కు కరోనా నెగెటివ్…

Saina Nehwal bjp

ఒలింపిక్ కాంస్య పతక విజేత, మాజీ ప్రపంచ నంబర్ 1 సైనా నెహ్వాల్ థాయ్‌లాండ్ ఓపెన్ 2021 లో పాల్గొనేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీ కి ముందు చేసిన కరోనా పరీక్షలో సైనాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిన్న ప్రకటించారు. అయితే ఈటోర్నీకి వెళ్లిన సైనా తన భర్త సహచర ఆటగాడు అయిన పారుపల్లి కశ్యప్ తో కలిసి ఒకే గదిలో ఉండటంతో అతడిని కూడా క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కానీ తాజా సమాచారం ప్రకారం సైనా నెహ్వాల్ కు కరోనా లేదని రిపోర్ట్ లో గందరగోళం జరిగింది అని బిడబ్ల్యుఎఫ్ ప్రకటించింది. నెహ్వాల్ తో పాటుగా కరోనా పాజిటివ్ గా పరీక్షించబడిన మరో ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ కూడా కరోనా సోకలేదని తెలిపింది. దాంతో వీరు తిరిగి థాయ్‌లాండ్ ఓపెన్ లో పాల్గొననున్నారు. నిన్న రద్దు చేసిన వీరి మ్యాచ్ లను ఈరోజు నిర్వహించనున్నారు. సైనా నెహ్వాల్ కు కరోనా సోకలేదు కాబట్టి తన భర్త రూమ్‌మేట్ పరుపల్లి కశ్యప్ ఈరోజు తన ఆటను ప్రారంభించనున్నారు. అయితే నిన్న కరోనా పాజిటివ్ పరీక్షించిన నలుగురు ఆటగాళ్లలో ముగ్గురికి నెగెటివ్ వచ్చింది. వారు డ్రాలో చోటు దక్కించుకున్నారు. వారు సైనా నెహ్వాల్ (ఇండియా), హెచ్ఎస్ ప్రణయ్ (ఇండియా), మరియు జోన్స్ రాల్ఫీ జాన్సెన్ (జర్మనీ). నాల్గవ ఆటగాడు ఈజిప్టుకు చెందిన అధమ్ హతేమ్ ఎల్గామల్ కు పాజిటివ్ రావడంతో అతను ఈ టోర్నీని ఉపసంహరించుకున్నారు ”అని బిడబ్ల్యుఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

Related posts