telugu navyamedia
రాజకీయ

ప్రభుత్వ సాయం వద్దు ..

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి , ఆపైన హత్య చేసిన ఘటన దేశమంతా సంచలనం కలిగించింది .ఈ రోజు హోమ్ మంత్రి మహమూద్ మహమూద్​ అలీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ పరామర్శించారు. చిన్నారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు.

అయితే ప్రభుత్వం తమపట్ల ఉదాసీనంగా వ్యవరించిందనే కోపంతో ప్రభుత్వ సాయాన్ని వెనక్కిచ్చేస్తామని బాలిక కుటుంబ సభ్యులు తెలిపారు. మాకు చెక్కు కాదు ముఖ్యం.. మా బిడ్డ‌కు జ‌రిగిన అన్యాయానికి తమకు న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు.

Related posts