telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి: జేసీ డిమాండ్

jc-diwakar-reddy

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశంపై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి స్పందించారు. అనంతపురం జిల్లాలోని యాడికిలో నిన్న జేసీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటే అమరావతి ఉండాలని అన్నారు. లేదంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి కొత్తగా గ్రేటర్ రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

గ్రేటర్ రాయలసీమ కుదరని పక్షంలో కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేయాలని సూచించారు. అయినా, ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts