telugu navyamedia
తెలంగాణ వార్తలు

హుస్సేన్ సాగ‌ర్‌లో గణేశ్‌ నిమ‌జ్జ‌నానికి సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్‌

హుస్సేన్ సాగ‌ర్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ట్యాంక్‌బండ్ లోని హుస్సేన్ సాగ‌ర్‌లో పీవోపీ విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయ‌కూడ‌ద‌ని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై ప్ర‌భుత్వం వేసిన రివ్యూ పిటిష‌న్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది.

దీనిపై వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగ‌ర్ గ‌ణేశ్‌ నిమ‌జ్జ‌నానికి సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది. ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి ఈ ఏడాదికే మిన‌హాయింపు ఇస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది. జీహెచ్ఎంసీని అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

Related posts