ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా “సాహో” బాగానే కలెక్షన్స్ను రాబడుతోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ పలు భాషలలో రిలీజైన ఈ చిత్రం అభిమానులని కూడా పెద్దగా అలరించలేకపోయిందనే టాక్ నడుస్తుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర సాహోకి తిరుగులేదనిపిస్తుంది. చెన్నైలో ఈ చిత్రం ఇప్పటి వరకు 73 లక్షల గ్రాస్ (అన్ని వర్షెన్స్ కలుపుకొని) వసూళ్ళు రాబట్టిందని అంటున్నారు. తమిళనాడులో 4 కోట్ల గ్రాస్ వసూళ్ళు రాబట్టిన “సాహో” కేవలం తెలుగు వర్షెన్కే 32లక్షల గ్రాస్ వసూళ్ళు సాధించింది. గతంలో మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం చెన్నైలో ఒక రోజుకి 27 లక్షలు రాబట్టింది. గత రికార్డులని తిరగరాసిన “సాహో” రానున్న రోజులలో మరిన్ని రికార్డులు చెరిపేస్తుందని అంటున్నారు. “సాహో” చిత్రం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఇందులో పలువురు బాలీవుడ్ స్టార్స్ ముఖ్య పాత్రలలో కనిపించి సందడి చేశారు.
previous post