యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ “ఎనిమీ”. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్దాస్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు.
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పెప్పీ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు .
‘పడదే.. పడదే’ అంటూ సాగిన ఈ లిరికల్ వీడియో సాంగ్ సరికొత్త ట్యూన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి సాంగ్ ఇదే. బ్లాక్బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వివేక్ సాహిత్యం అందించిన ఈ సాంగ్ ను పృధ్వీ చంద్ర పాడారు. ఈ సాంగ్ ను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.
హీరో విశాల్,హీరోయిన్ మృణాలిని రవి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకి హైలెట్గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని భాషలలో కలిపి 20 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించింది. దీంతో ఈ సినిమాపై అంఛనాలను భారీగా పెరిగాయి.
గతంలో బాలా రూపొందించిన “వాడు-వీడు” సినిమాలోవిశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్ని షేక్ చేశారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న సినిమా ‘ఎనిమీ’. యాక్షన్ హీరో విశాల్ కు ఇది 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న “ఎనిమీ” త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.