మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా నాగార్జున హీరోగా ప్రస్తుతం చిలసౌ ఫేం రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో “మన్మథుడు-2” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. రావు రమేశ్, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్, దేవదర్శిణి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. మనం ఎంటర్ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్కామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిరణ్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా పని చేస్తున్నారు. ఫన్ రైడ్గా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైనట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ని తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ లోని డైలాగులు నాగార్జున స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.